ఈ బ్లాగు ఎందుకు?
తెలుగు భాషా జ్ఞానం కొఱవడుతోందని కొందరు వేదన పడుతున్నారు . పిల్గలు తెలుగు చదవలేక పోతున్నారని మరికొందరు వాపోతున్నారు . వ్రాయటం అలా ఉంచండి , తెలుగు మాట్లాడితే చాలు అనే దుస్థితిలో ఉన్నాం . ముందు ఆ విషయంలో జాగృతి రావాలి . ‘ భాష చనిపోవటమేమిటి , అదేమన్నా ప్రాణమున్న వస్తువా ’ అని కొంత మంది నిర్లక్ష్యం చేస్తారు . ప్రాణి కదులుతున్నంత వరకూ , ఇంద్రియాలు పనిచేస్తున్నంత వరకూ ‘ జీవి ’ అంటాం . లేకపోతే ‘ నిర్జీవి ’ ( మరీ నిర్వచనంలోకి దూరిపోయి ‘ మరి కోమా పేషంటు సంగతేంటి ’ అని అడగద్దు ). అలాగే భాషకూడా - సంఘంలో అధిక శాతం ప్రజలు తమ మాతృభాషలో మాట , పాట , వ్రాత , చేత ( చదవటం ) చే...